కువైట్ చరిత్రలోనే తొలిసారిగా.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- February 02, 2023
కువైట్ : కువైట్ చరిత్రలోనే తొలిసారిగా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారులు దాదాపు 15 మిలియన్ల లిరికా (ప్రీగాబాలిన్) మాత్రలు, ముడి పౌడర్ రూపంలో అర టన్ను ఔషధాలను స్వాధీనం చేసుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి, తాత్కాలిక రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు అధికారులు ఒక భారీ మత్తుపదార్థాల నిల్వ కేంద్రంపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ స్థావరాన్ని అంతర్జాతీయ ముఠా నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాప్సూల్స్లో ప్యాక్ చేసి విక్రయించే డ్రగ్తో పాటు పౌడర్ రూపంలో టాబ్లెట్లను ఈ ముఠా తయారు చేస్తుందని తెలిపారు. సంఘటనా స్థలంలో నలుగురిని అరెస్టు చేశామన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









