ఫుడ్ పాయిజనింగ్: రెస్టారెంట్ మూసివేత
- February 03, 2023
యూఏఈ: ఫుడ్ పాయిజనింగ్పై పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో అబుధాబిలోని ఒక రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నారు. ఆహార-పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ ను మూసివేశారు. అబుధాబిలోని బర్గర్ అల్ అరబ్ రెస్టారెంట్, కెఫెటేరియా సదుపాయాన్ని మూసివేయాలని అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ జారీ చేసింది. సాల్మొనెల్లా బాక్టీరియాతో కలుషితమైన గ్రిల్డ్ చికెన్ మీల్స్ను కస్టమర్లు తిన్న తర్వాత అనేక మంది కస్టమర్లు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఆహార నిల్వ, నిర్వహణ, తయారీలో సరైన పద్ధతులను అవుట్లెట్ పాటించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోగ్య అధికారులు నివేదిక సమర్పించారు. ఆహార తయారీ సమయంలో రెస్టారెంట్ పరిశుభ్రత పాటించడంలో విఫలమైందని, ఆహార నిల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నివాసితులు ఫుడ్ అవుట్లెట్లలో ఏవైనా ఉల్లంఘనలు జరిగినా లేదా ఆహార ఉత్పత్తుల విషయాలపై సందేహాలుంటే అబుధాబి ప్రభుత్వ టోల్-ఫ్రీ నంబర్ 800555కు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







