ఫుడ్ పాయిజనింగ్: రెస్టారెంట్ మూసివేత
- February 03, 2023
యూఏఈ: ఫుడ్ పాయిజనింగ్పై పలువురు కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో అబుధాబిలోని ఒక రెస్టారెంట్ పై చర్యలు తీసుకున్నారు. ఆహార-పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ ను మూసివేశారు. అబుధాబిలోని బర్గర్ అల్ అరబ్ రెస్టారెంట్, కెఫెటేరియా సదుపాయాన్ని మూసివేయాలని అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (అడాఫ్సా) అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ జారీ చేసింది. సాల్మొనెల్లా బాక్టీరియాతో కలుషితమైన గ్రిల్డ్ చికెన్ మీల్స్ను కస్టమర్లు తిన్న తర్వాత అనేక మంది కస్టమర్లు అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. ఆహార నిల్వ, నిర్వహణ, తయారీలో సరైన పద్ధతులను అవుట్లెట్ పాటించకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోగ్య అధికారులు నివేదిక సమర్పించారు. ఆహార తయారీ సమయంలో రెస్టారెంట్ పరిశుభ్రత పాటించడంలో విఫలమైందని, ఆహార నిల్వలు అధ్వాన్నంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. నివాసితులు ఫుడ్ అవుట్లెట్లలో ఏవైనా ఉల్లంఘనలు జరిగినా లేదా ఆహార ఉత్పత్తుల విషయాలపై సందేహాలుంటే అబుధాబి ప్రభుత్వ టోల్-ఫ్రీ నంబర్ 800555కు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







