విలువైన నకిలీ కాయిన్స్ స్వాధీనం
- February 03, 2023
ముంబై: ముంబైలో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబైకి వెళ్లి సోదాలు చేశారు. మలాద్ ప్రాంతం వల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా, అందులో కొన్ని బస్తాలు కనపడ్డాయి.
వాటిని పోలీసులు తెరిచి చూడగా అందులో నాణేలు దొరికాయి. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల ఓ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. మొత్తం రూ.9.46 లక్షల నకిలీ నాణేలు దొరికాయని చెప్పారు. హరియాణాలో నకిలీ నాణేల కర్మాగారం ఉందని, దానిపై దాడి చేసిన స్పెషల్ సెల్ అధికారులు అయిదుగురిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ముంబైకి కారులో పెద్ద ఎత్తున నకిలీ నాణేలు వెళ్లాయని గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. ప్రార్థనా మందిరాల వద్ద నిందితులు నకీలీ నాణేలను మార్చుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







