విలువైన నకిలీ కాయిన్స్ స్వాధీనం
- February 03, 2023
ముంబై: ముంబైలో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబైకి వెళ్లి సోదాలు చేశారు. మలాద్ ప్రాంతం వల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా, అందులో కొన్ని బస్తాలు కనపడ్డాయి.
వాటిని పోలీసులు తెరిచి చూడగా అందులో నాణేలు దొరికాయి. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల ఓ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. మొత్తం రూ.9.46 లక్షల నకిలీ నాణేలు దొరికాయని చెప్పారు. హరియాణాలో నకిలీ నాణేల కర్మాగారం ఉందని, దానిపై దాడి చేసిన స్పెషల్ సెల్ అధికారులు అయిదుగురిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ముంబైకి కారులో పెద్ద ఎత్తున నకిలీ నాణేలు వెళ్లాయని గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. ప్రార్థనా మందిరాల వద్ద నిందితులు నకీలీ నాణేలను మార్చుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







