ముగిసిన కె.విశ్వనాథ్ అంత్యక్రియలు..
- February 03, 2023
హైదరాబాద్: కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు.గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ రెండు రోజులు క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.చికిత్స పొందుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి తుదిశ్వాస విడిచారు.ఆయన మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథ్ మరణానికి చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రముఖులు మరియు అభిమానుల సందర్శనార్ధం కోసం కె.విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఉదయం ఆయన ఇంటి వద్దనే ఉంచగా, మధ్యాహ్నం నుండి ఆయన అంతిమయాత్ర మొదలయింది. పంజాగుట్ట శ్మశానవాటికలో విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. కె.విశ్వనాథ్ కుమారులు నాగేంద్ర నాథ్, రవీంద్ర నాథ్ హిందూ సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కళాతపస్వికి కడసారి వీడ్కోలు పలికేందుకు అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా పంజాగుట్ట శ్మశానవాటికకు చేరుకున్నారు.
ఆయన ఇక లేరు అన్న వార్త సినీ పరిశ్రమని కలిచివేస్తుంది.కళనే కథగా చూపించాలనే కళాతపస్వి భావన.. తన సినిమాల్లో భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేసేలా చేసింది. నిజానికి చెప్పాలి అంటే రాజమౌళి కంటే ముందే తెలుగు సినిమా సత్తా చూపించిన దర్శకుడు కె.విశ్వనాథ్. తన సినిమాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆ సమయంలోనే తెలుగు చిత్రాన్ని నిలబెట్టారు. ఆయన సినిమాల్లో పాత్రధారులు కనిపించరు, పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.విశ్వనాథ్ సినిమాల్లో నటిస్తే చాలు ఆ నటుడికి అవార్డు పక్కా. అందుకనే నటులు ఆయన సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తారు, ఆ అవకాశాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఏదేమైన కె.విశ్వనాథ మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అనే చెప్పాలి.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









