మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి కృషి: బహ్రెయిన్
- February 03, 2023
బహ్రెయిన్: మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి బహ్రెయిన్ కృషి చేస్తుందని షురా కౌన్సిల్ చైర్మన్ అలీ బిన్ సలేహ్ అల్ సలేహ్ అన్నారు. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా రాయల్ విజన్ నుండి ప్రేరణ పొందినట్లు అల్ సలేహ్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతిని పెంపొందించడానికి రాజు దార్శనికతలకు హెచ్ఎం మద్దతునిస్తూ, క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అధ్యక్షతన ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలో ఏటా ఫిబ్రవరి 4న జరుపుకునే అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం సందర్భంగా అల్ సలేహ్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య ప్రేమ, ఆప్యాయత, సోదరభావాన్ని వ్యాప్తి చేయడానికి, విభిన్న సంస్కృతులు, మతాలు, నమ్మకాల మధ్య నిర్మాణాత్మక సంభాషణలను ప్రోత్సహించడానికి బహ్రెయిన్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అల్ సలేహ్ పేర్కొన్నారు. బహ్రెయిన్ రాజ్యం, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ చేసిన సంయుక్త తీర్మానం ద్వారా గొప్ప సాంస్కృతిక, మతపరమైన సహనాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









