ప్రెగ్నెంట్ లేడీస్ ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల నష్టాలేమైనా వున్నాయా.?
- February 03, 2023
ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు దేవుడిచ్చిన ఓ వరం. ఈ టైమ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండాల్సి వుంటుంది. కొన్ని తినకూడనివి, కొన్ని ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్ధాలుంటాయ్.
అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వేవిళ్లు.. అదే వాంతులు ఎక్కువగా అవుతుంటాయ్ కొంతమంది గర్భిణుల్లో. ఈ టైమ్లో బాగా నీరసించిపోతుంటారు. ఏదీ తినబుద్ది కాదు.. దాంతో బాగా వీక్గా కనిపిస్తుంటారు. ఈ వీక్నెస్ కారణంగా కడుపులోని బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయ్.
సహజంగా వాంతులు ఎక్కువగా అవుతుంటే, ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తుంటారు. అయితే, ప్రెగ్నెంట్ లేడీస్కి ఓఆర్ఎస్ ద్రావణాన్ని కాస్త తక్కువగానే తాగించాలట. దాని ప్లేస్లో నిమ్మరసం, నారింజ రసం ఇస్తే మంచిదని గైనిక్ నిపుణులు చెబుతున్నారు.
అలాగే, రాగి పిండితో చేసిన జావతో పాటూ, నిమ్మకాయ కలిపిన మజ్జిగ వంటివి ఇస్తే, నీరసం నుంచి తొందరగా తేరుకునే అవకాశాలుంటాయ. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పటికీ, నోటికి ఏదీ సహించనప్పటికీ తినాల్సిన ఆహారాన్ని ఏదో ఒక రకంగా తీసుకోవాలనీ వ్యైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పండ్లూ, పండ్ల రసాలను తరచుగా తీసుకోవాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









