ప్రెగ్నెంట్ లేడీస్ ఆ లిక్విడ్ తీసుకోవడం వల్ల నష్టాలేమైనా వున్నాయా.?
- February 03, 2023
ప్రెగ్నెన్సీ అనేది మహిళలకు దేవుడిచ్చిన ఓ వరం. ఈ టైమ్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండాల్సి వుంటుంది. కొన్ని తినకూడనివి, కొన్ని ఖచ్చితంగా తినాల్సిన ఆహార పదార్ధాలుంటాయ్.
అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వేవిళ్లు.. అదే వాంతులు ఎక్కువగా అవుతుంటాయ్ కొంతమంది గర్భిణుల్లో. ఈ టైమ్లో బాగా నీరసించిపోతుంటారు. ఏదీ తినబుద్ది కాదు.. దాంతో బాగా వీక్గా కనిపిస్తుంటారు. ఈ వీక్నెస్ కారణంగా కడుపులోని బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయ్.
సహజంగా వాంతులు ఎక్కువగా అవుతుంటే, ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తుంటారు. అయితే, ప్రెగ్నెంట్ లేడీస్కి ఓఆర్ఎస్ ద్రావణాన్ని కాస్త తక్కువగానే తాగించాలట. దాని ప్లేస్లో నిమ్మరసం, నారింజ రసం ఇస్తే మంచిదని గైనిక్ నిపుణులు చెబుతున్నారు.
అలాగే, రాగి పిండితో చేసిన జావతో పాటూ, నిమ్మకాయ కలిపిన మజ్జిగ వంటివి ఇస్తే, నీరసం నుంచి తొందరగా తేరుకునే అవకాశాలుంటాయ. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పటికీ, నోటికి ఏదీ సహించనప్పటికీ తినాల్సిన ఆహారాన్ని ఏదో ఒక రకంగా తీసుకోవాలనీ వ్యైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పండ్లూ, పండ్ల రసాలను తరచుగా తీసుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







