జీతాలు చెల్లించని కంపెనీపై కార్మిక శాఖ చర్యలు

- February 04, 2023 , by Maagulf
జీతాలు చెల్లించని కంపెనీపై కార్మిక శాఖ చర్యలు

మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అల్ దహిరా గవర్నరేట్‌లో గత కొద్ది నెలలుగా తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనందుకు ఒక ప్రైవేట్ రంగ సంస్థపై కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అల్దాహిరా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వ శాఖ, అనేక నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంపై కార్మిక చట్టం ఆర్టికల్ నంబర్‌ 53, 51  నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ప్రైవేట్ రంగ కంపెనీపై చర్యలు తీసుకోవాలని న్యాయ అధికారులకు రిఫర్ చేసినట్లు ప్రకటించింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ నెం. (51)లో పేర్కొన్న తేదీలలోపు తమ ఉద్యోగులకు వేతనాల చెల్లింపుకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ అన్ని ప్రైవేట్ రంగ సంస్థలు, కంపెనీలకు పిలుపునిచ్చింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ No51 కింద నెలవారీ వేతనాలపై నియమించబడిన కార్మికులకు వారి వేతనాలను కనీసం ప్రతి నెలా ఒకసారి చెల్లించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com