ఈ వారాంతంలో యూఏఈలో అరుదైన ఆకుపచ్చ తోకచుక్క.. ఇలా చూడవచ్చు
- February 04, 2023
యూఏఈ: ప్రతి 50 వేల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే భూమిపై కనిపించే అతి అరుదైన ఆకుపచ్చ తోకచుక్క యూఏఈలో ఈ వారాంతంలో కనువిందు చేయనున్నది. C/2022 E3 (ZTF) అనే పేరుగల ఆకుపచ్చ రంగు తోకచుక్క ఫిబ్రవరి 1న భూమికి సమీపంలోకి వచ్చింది. ఇది ఫిబ్రవరి 5 వరకు ఆకాశంలో కనిపిస్తుందని అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర కేంద్రం (IAC) తెలిపింది. జనవరి 14 తెల్లవారుజామున అబుధాబి ఎడారిలో దీన్ని స్పష్టంగా చూసినట్లు ఐఏసీ పేర్కొంది. కామెట్ ఇప్పుడు భూమికి 26 మిలియన్ మైళ్ల (42 మిలియన్ కిలోమీటర్లు) దూరంలోకి వచ్చింది. ఇది గంటకు 207,000కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర అర్ధగోళంలో ఉన్న దేశాలలో గత కొన్ని వారాలుగా ఈ కామెట్ కనిపిస్తుంది. ఈ వారాంతంలో UAE ఆకాశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ (DAG) CEO హసన్ అల్ హరిరి తెలిపారు. అయితే, కామెట్ ప్రకాశాన్ని అంచనా వేయడం కష్టం అని వివరించారు. కానీ అది కంటితో చూడగలిగేంత ప్రకాశవంతం కాకపోయినా, ఫిబ్రవరి ప్రారంభంలో బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోప్లతో వీక్షించవచ్చ గుడ్ న్యూస్ తెలిపారు. దుబాయ్లోని అల్ ఖుద్రా ఎడారిలో ఫిభ్రవరి 4న సాయంత్రం 6.30 నుండి 9.30 గంటల వరకు ప్రత్యేక టిక్కెట్ ఈవెంట్ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామెట్, చంద్రుడు, మార్స్, బృహస్పతి, లోతైన ఆకాశ వస్తువులు టెలిస్కోప్ పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ సెషన్లు, స్కై మ్యాపింగ్, మరిన్నింటి గురించి చర్చలు జరుగుతాయని తెలిపారు.
నివాసితులు ఇంటి నుండి చూడవచ్చా?
తమ ఇళ్ల నుండి ఖగోళ శరీరాన్ని పరిశీలించాలనుకునే వారు ప్రత్యేక పరికరాలతో చూడవచ్చు. కామెట్ను పరిశీలించడానికి బైనాక్యులర్లు ఉత్తమ సాధనాలు అని అల్ హరిరి చెప్పారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







