యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడిన భారత ప్రధాని మోదీ
- February 04, 2023
యూఏఈ: యూఏఈ ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని మెరుగుపరచడానికి, వారి పరిధిని విస్తరించే మార్గాల గురించి చర్చించారు. ఇది రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పరస్పరం ఆందోళన కలిగించే అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు. సంబంధిత పరిణామాలను సమీక్షించారు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, మోడీ తమ దేశాలు తమ అభివృద్ధి లక్ష్యాలను మరింత సాధించడానికి వివిధ రంగాలలో తమ భాగస్వామ్యాన్ని, సహకారాన్ని పెంచుకుంటూనే ఉండాలని నిర్ణయించినట్లు ఇరుదేశాల విదేశాంగ శాఖలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం







