ఎస్..కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుంది – కేటీఆర్
- February 04, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనా కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. తమది ముమ్మాటికీ.. కుటుంబపాలనే అని, తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని, సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని కేటీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని తెలిపారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని చేస్తూ వస్తున్నాడు కాబట్టే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని..తమకు కూడా అండగా ఉండమని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









