ఎస్..కేసీఆర్ కుటుంబ పాలన సాగుతుంది – కేటీఆర్
- February 04, 2023
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనా కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను మంత్రి కేటీఆర్ స్వీకరించారు. తమది ముమ్మాటికీ.. కుటుంబపాలనే అని, తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులేనని, సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్ద అని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు. అందుకే కుటుంబపాలన అంటున్న ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని కేటీఆర్ అన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి కుటుంబంలోని అవ్వ, తాతకు పెన్షన్ ఇస్తూ పెద్ద కొడుకులా ఆసరా అయితుండని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 4కోట్ల మందిని తోబుట్టువుగా చూసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. కంటి వెలుగుతో వృద్ధులకు కంటి చూపు, గురుకులాలు, కాలేజీలతో పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్న కేసీఆర్.. ఒంటరి మహిళలకు ఫించన్ ఇస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని తెలిపారు. 12 లక్షల మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించి కేసీఆర్ మేనమామలా అండగా నిలిచాడని చెప్పుకొచ్చారు. ఇలా అన్ని చేస్తూ వస్తున్నాడు కాబట్టే దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందని..తమకు కూడా అండగా ఉండమని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







