కువైట్ ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్.. కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులు
- February 08, 2023
కువైట్: ప్రవాస భారతీయుల నుంచి కాన్సులర్ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భారత రాయబారి భారతీయ పౌరులకు సబంధించిన కాన్సులర్ సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో ఫిబ్రవరి 8వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు ఓపెన్ హౌజ్ జరగనుంది. భారతీయ పౌరులు ఉదయం 9:30 గంటల నుండి రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఓపెన్ హౌస్ సమయంలో భారతీయ పౌరులకు ఏవైనా కాన్సులర్ సమస్యలను పరిష్కరించడానికి రాయబారి, కాన్సులర్ అధికారులు అందుబాటులో ఉంటారని ఇండియన్ ఎంబసీ కార్యాలయం తన ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







