వందలాది ఉద్యోగుల్ని తొలగిస్తున్న EBay..
- February 08, 2023ప్రముఖ ఈకామర్స్ కంపెనీఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఏదో విధంగా నెట్టుకొచ్చిన కంపెనీలు ఆ ప్రభావం తాజాగా పడటానికి తోడు ఆర్థిక సంక్షోభం వెరసి ఉద్యోగుల కోత విధిస్తున్నాయి పలు కంపెనీలు. కరోనా మహమ్మారి తర్వాత అమ్మకాలు తగ్గడంతో 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని ఈబే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జామీ ఇయానోన్ మంగళవారం (ఫిబ్రవరి 7,2023) ప్రకటించారు. 4 శాతం ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈబే కంపెనీ సీఈఓ జామీ ఇయానోస్ తెలిపారు.
1995లో అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థాపించబడిన ఈబే ఈకామర్స్ అమ్మకాలు, కొనుగోలు ప్లాట్ ఫామ్ గా ఉంది. ఎలక్ట్రానిక్స్,ఫ్యాషన్ ప్రొడక్ట్స్ నుంచి గిఫ్టు ఆర్టికల్స్ తో పాటు అనేక రకాల ఉత్పత్తులు ఈబేలో విక్రయానికి అందుబాటులో ఉంటాయి.
డెల్ కంపెనీ,జూమ్ కంపెనీ కూడా ఉద్యోగుల కోత విధించాయి. జూమ్ 1300ల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రటించింది. అలాగే డెల్ 6,600 ఉద్యోగాలను తగ్గించింది. అమ్మకాలు క్షీణించి ఆదాయం తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు తప్పలేదని కంపెనీ వివరించింది. అలాగే ఈకామర్స్ కంపెనీ అమెజాన్ ఏకంగా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇలా ఈ కంపెనీ ఈ కంపెనీ అనిలేదు ఉద్యోగుల కోత ప్రకటనల్ని మోతెక్కిస్తున్నాయి. ఆయా కంపెనీల ప్రకటనలతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..