తైఫ్లో కారు ప్రమాదం.. ఇద్దరు ఉపాధ్యాయులతో సహా నలుగురు మృతి
- February 10, 2023
తైఫ్: తైఫ్కు ఉత్తరాన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతో సహా రెండు కార్ల డ్రైవర్లు మరణించారు.ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగింది. మృతుల్లో తైఫ్ గవర్నరేట్ నుండి తైఫ్కు ఉత్తరాన 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహనీలోని మాధ్యమిక పాఠశాలకు వెళుతున్న ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్ల డ్రైవర్లు కూడా మృతి చెందారు. ట్రాఫిక్ అధికారులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తైఫ్లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఫహద్ అల్-షరీఫ్ ప్రమాదంపై ఫాలోఅప్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







