రెండు ఐఫోన్14 ఫోన్లతో దొరికిపోయిన ఎయిర్ ఇండియా పైలట్..
- February 14, 2023
ముంబై: భారత వైమానిక సంస్థ ఎయిర్ ఇండియా కొంతకాలంగా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే.ఇటీవలి పీ గేట్ సహా పలు వివాదాలు సంస్థను అప్రతిష్టపాలు చేశాయి.ఈ తప్పిదాలకు సంస్థ భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇవి మరిచేలోగా మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది.ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు.దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి రెండు కొత్త ఖరీదైన ఫోన్లు తీసుకురాకూడదు. కానీ, అక్కడ పన్నులు తక్కువగా ఉండటంతో అతడు ఐఫోన్ 14లు ఇండియా తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దీంతో భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ అప్రమత్తమైంది. తమ క్యాబిన్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా గ్రూప్ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీని ప్రకారం పైలట్లు, ఎయిర్ హోస్టులు సహా విమాన సిబ్బంది ఎవరూ టాటా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అతిక్రమించకూడదు. వాళ్లు చేసే తప్పుడు పనుల వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది. అనుమతి లేకుండా విమానాలు, సంస్థలు, ప్రాంగణంలోని ఎలాంటి వస్తువును తొలగించకూడదు.ఇక పై విమానాలు గమ్య స్థానం చేరుకోగానే, సంస్థ సిబ్బందిని తనిఖీ చేస్తారు. ఒకవేళ సంస్థ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









