ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..

- February 15, 2023 , by Maagulf
ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా.. ఆయన బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది.  త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100ల కాయిన్ రానుంది. కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు కానుంది. ఈసందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. నమూనాను చూపించి అధికారులు సలహా కోరారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com