ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 కాయిన్..
- February 15, 2023
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కనుంది. ఎన్టీఆర్ అందించిన సేవలకు గుర్తుగా.. ఆయన బొమ్మతో రూ.100 కాయిన్ ముద్రించాలని కేంద్రం నిర్ణయించింది. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100ల కాయిన్ రానుంది. కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా వెండితో రూ.100 కాయిన్ తయారు కానుంది. ఈసందర్భంగా మింట్ అధికారులు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు. నమూనాను చూపించి అధికారులు సలహా కోరారు. పురందేశ్వరికి వారు ఈ వెండినాణేన్ని, దానిపై ఎన్టీఆర్ బొమ్మ మోడల్ ను చూపించారు. ఈ నమూనాకు పురందేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో ఈ రూ.100 నాణెం బయటికి రానుంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







