బహ్రెయిన్లో ఫిబ్రవరి 20న 'విజువల్ ట్రాన్స్లేషన్స్' ఎక్స్పో
- February 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ రాజ్యంలో "విజువల్ ట్రాన్స్లేషన్స్" ఆర్ట్ ఎగ్జిబిషన్కు వేదిక సిద్ధమైంది. ఈ ఈవెంట్ను బహ్రెయిన్ ఆర్ట్ హబ్ (BAH)తో కలిసి ది డైలీ ట్రిబ్యూన్, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ నిర్వహిస్తున్నాయి. భారత రాయబారి హెచ్.ఇ. పీయూష్ శ్రీవాస్తవ ఫిబ్రవరి 20న సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మానవ, ఆర్థిక వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి నయీఫ్ అల్ షెరూఖీ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫిబ్రవరి 20 నుండి 28 వరకు ఉమ్ అల్ హసమ్లోని మెకిండీజ్ టవర్లోని డైలీ ట్రిబ్యూన్ కార్యాలయంలో కళాకారులు రూపొందించిన పెయింటింగ్లు ప్రదర్శించబడతాయి. ఇందులో పాల్గొంటున్న బహ్రెయిన్ ఆర్ట్ హబ్ లో భారతీయ కళాకారులైన ఆటమ్జీత్ సింగ్ బావా, నిజూ జాయ్, సాగర్ అద్కర్, సైరా రంజ్, సుదీప్ దేశ్పాండే, తేజ్బీర్ సింగ్, బహ్రెయిన్ కళాకారుడు మొహమ్మద్ తాహా ఉన్నారు. ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ( IFAS)ని 1974లో స్థాపించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా సరిహద్దులకు అతీతంగా ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. ఇండో-బహ్రెయిన్ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించడంలో IFAS అగ్రగామిగా ఉంది. ప్రపంచ స్థాయి భారతీయ కళాకారులను బహ్రెయిన్ తీసుకురావడంలో ఈ గ్రూపుది కీలక పాత్ర.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







