ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు: వీసీ సజ్జనార్
- February 16, 2023వరంగల్: టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ గురువారం వరంగల్ పర్యటనకు విచ్చేశారు.ఆర్టీసీకి ఆర్ధిక పరిపుష్టిని తీసుకురావడంతో పాటు నష్టాలను అధిగమించడంపై విసి సజ్జనార్ ఫోకస్ చేసిన మేరకు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ రీజియన్ ను లాభాల బాట పట్టించేందుకు ఉన్న అవకాశాలు, ఆర్టీసీకి అదనపు ఆదాయవనరులు సమకూర్చుకొనే ప్రయత్నాలతో పాటు, ఆర్టీసీని గాడిలో పెట్టె పనుల్లో సజ్జనార్ నిమగ్నమయ్యారు. ఉద్యోగుల్లోను జవాబుదారితనంను పెంచడం, ఆర్టీసీ బస్సు ఆక్యుపెన్సీ రేషియోను పెంచడం,అలాగే బస్సులకె ఎంపిఎల్ ను పెంచడంపై దృష్టి సారించారు. అంతేగాక హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించి, ప్రయాణీకులకు కల్పిస్తున్న వసతులపై విసి సజ్జనార్ ఆరా తీశారు. ప్రయాణీకుల అవసరాలను తీరుస్తూ, సగటు ప్రయాణీకుల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ముందడుగేస్తున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. హన్మకొండకు వచ్చిన ఆర్టీసీ విసి అండ్ ఎండిని హన్మకొండ సిఐ శ్రీనివాస్ జీ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్