సిరియాకు మరో 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన యూఏఈ అధ్యక్షుడు
- February 16, 2023
యూఏఈ: సిరియాలో భూకంప బాధిత ప్రజల కోసం అదనంగా $50 మిలియన్ల సహాయాన్ని అందించాలని ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఈ మొత్తంలో $20 మిలియన్లను ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం (UN OCHA) నిర్వహిస్తున్న అత్యవసర మానవతా ప్రాజెక్టులకు కేటాయించాలని ఆదేశించారు. సిరియాలో భూకంప ప్రభావిత బాధితులకు UAE అదనంగా $50 మిలియన్లు అందించడాన్ని మానవతా వ్యవహారాల అండర్-సెక్రటరీ జనరల్, కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) అత్యవసర సహాయ సమన్వయకర్త మార్టిన్ గ్రిఫిత్స్ ప్రశంసించారు. యూఏఈ అధ్యక్షుడు గతంలో సిరియాలో భూకంపాల వల్ల ప్రభావితమైన వారి సహాయానికి $50 మిలియన్లు, టర్కీకి US$50 మిలియన్లు అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు టర్కీ, సిరియాలకు 70 విమానాల ద్వారా సహాయ సామాగ్రిని యూఏఈ పంపించింది. ఇందులో సుమారు 1,243 మెట్రిక్ టన్నుల ఆహారం, వైద్య సహాయం, 2,893 గుడారాలున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు పనిచేస్తున్నారు. అంతేకాకుండా టర్కిలోని గాజియాంటెప్లోని ఇస్లాహియే జిల్లాలో ఫీల్డ్ హాస్పిటల్ ప్రారంభించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!









