సిరియాకు మరో 50 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన యూఏఈ అధ్యక్షుడు
- February 16, 2023
యూఏఈ: సిరియాలో భూకంప బాధిత ప్రజల కోసం అదనంగా $50 మిలియన్ల సహాయాన్ని అందించాలని ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశించారు. ఈ మొత్తంలో $20 మిలియన్లను ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం (UN OCHA) నిర్వహిస్తున్న అత్యవసర మానవతా ప్రాజెక్టులకు కేటాయించాలని ఆదేశించారు. సిరియాలో భూకంప ప్రభావిత బాధితులకు UAE అదనంగా $50 మిలియన్లు అందించడాన్ని మానవతా వ్యవహారాల అండర్-సెక్రటరీ జనరల్, కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (OCHA) అత్యవసర సహాయ సమన్వయకర్త మార్టిన్ గ్రిఫిత్స్ ప్రశంసించారు. యూఏఈ అధ్యక్షుడు గతంలో సిరియాలో భూకంపాల వల్ల ప్రభావితమైన వారి సహాయానికి $50 మిలియన్లు, టర్కీకి US$50 మిలియన్లు అందించాలని ఆదేశించారు. ఇప్పటివరకు టర్కీ, సిరియాలకు 70 విమానాల ద్వారా సహాయ సామాగ్రిని యూఏఈ పంపించింది. ఇందులో సుమారు 1,243 మెట్రిక్ టన్నుల ఆహారం, వైద్య సహాయం, 2,893 గుడారాలున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యూఏఈ సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) బృందాలు పనిచేస్తున్నారు. అంతేకాకుండా టర్కిలోని గాజియాంటెప్లోని ఇస్లాహియే జిల్లాలో ఫీల్డ్ హాస్పిటల్ ప్రారంభించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







