గురువారం నుంచి శనివారందాకా ఉచిత పార్కింగ్
- May 02, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్ వ్యాప్తంగా పార్కింగ్ని గురువారం నుంచి శనివారం దాకా ఉచితం అని ప్రకటించింది. ఇస్రా మరియు మిరాజ్ హాలిడే సందర్భంగా అన్ని సేవలూ నిలిచిపోతాయని తిరి మే 8 ఆదివారం నుంచి యధాతథంగా సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే మల్టీ లెవల్ పార్కింగ్ లాట్స్ మరియు ఫిష్ మార్కెట్ పార్కింగ్ ఏరియాల్లో మాత్రం ఈ ఉచితానికి మినహాయింపు ఉందని అధికారులు పేర్కొన్నారు. పెయిడ్ పార్కింగ్ సర్వీసులు శనివారం మే 7 నుంచి తిరిగి యాక్టివేట్ అవుతాయని ఆర్టిఏ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సెక్టార్ సీఈఓ యూసఫ్ అల్ రెడా చెప్పారు. మెట్రో గ్రీన్ లైన్ స్టేషన్స్, మెట్రో రెడ్ లైన్ స్టేషన్స్, దుబాయ్ ట్రామ్, పబ్లిక్ బస్ సర్వీస్, మెట్రో ఫీడర్ బస్ స్టేషన్స్, మెరైన ట్రాన్సిట్ వంటి సేవలకు సంబంధించి కూడా ఈ రోజుల్లో పలు మార్పులుంటాయి. శుక్ర, శని వారాల్లో ఆయా సర్వీసుల పనివేళల్ని కుదించారు. ప్లాటినం సెంటర్, తస్జీల్ ఎట్ బర్షా సెంటర్, తస్జీల్ ఎట్ అల్ ఖాసిస్ సెంటర్స్ తప్ప తమ స్ట్రాటజిక్ పార్టనర్స్ అన్నీ ఇస్రా, మిరాజ్ హాలిడే సందర్భంగా మూసివేయబడ్తాయని ఆర్టిఏ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ సర్వీస్ సెక్టార్ సీఈఓ చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







