Dh2.5 మిలియన్ల సిగరెట్ బాక్సుల చోరీ.. తొమ్మిది మందికి జైలు, జరిమానా
- February 20, 2023
దుబాయ్: అల్ ఖుసైస్లోని ఓ గిడ్డంగి నుంచి తొమ్మిది మంది వ్యక్తుల ముఠా 2.25 మిలియన్ దిర్హామ్ల విలువైన 375 సిగరెట్లను దొంగిలించారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అందులోని ప్రధాన నిందితులైన ఇద్దరికి దొంగిలించిన మొత్తం విలువను జరిమానాగా విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. పొగాకు వ్యాపార సంస్థ డైరెక్టర్ తన కంపెనీ గోదాములో చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. గోదాం వద్దకు వచ్చేసరికి మెయిన్ డోర్ పగులగొట్టి ఉందని బాధితుడు తెలిపాడు. ఆ తర్వాత గోదాంలో నుంచి 375 సిగరెట్ల పెట్టెలు చోరీకి గురైనట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐడీ బృందం నేరస్థలాన్ని పరిశీలించి అనుమానితులను విచారించింది. అల్ అవీర్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులకు రిటైల్ అమ్మకం కోసం సిగరెట్లను అందజేస్తుండగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వస్తువులు అల్ అవీర్లోని గోదాములో ఉంచినట్లు తొమ్మిది మంది దోషుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికార దాడిని చేసి బాక్సులతోపాటు మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







