Dh2.5 మిలియన్ల సిగరెట్ బాక్సుల చోరీ.. తొమ్మిది మందికి జైలు, జరిమానా
- February 20, 2023
దుబాయ్: అల్ ఖుసైస్లోని ఓ గిడ్డంగి నుంచి తొమ్మిది మంది వ్యక్తుల ముఠా 2.25 మిలియన్ దిర్హామ్ల విలువైన 375 సిగరెట్లను దొంగిలించారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అందులోని ప్రధాన నిందితులైన ఇద్దరికి దొంగిలించిన మొత్తం విలువను జరిమానాగా విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. పొగాకు వ్యాపార సంస్థ డైరెక్టర్ తన కంపెనీ గోదాములో చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. గోదాం వద్దకు వచ్చేసరికి మెయిన్ డోర్ పగులగొట్టి ఉందని బాధితుడు తెలిపాడు. ఆ తర్వాత గోదాంలో నుంచి 375 సిగరెట్ల పెట్టెలు చోరీకి గురైనట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐడీ బృందం నేరస్థలాన్ని పరిశీలించి అనుమానితులను విచారించింది. అల్ అవీర్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులకు రిటైల్ అమ్మకం కోసం సిగరెట్లను అందజేస్తుండగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వస్తువులు అల్ అవీర్లోని గోదాములో ఉంచినట్లు తొమ్మిది మంది దోషుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికార దాడిని చేసి బాక్సులతోపాటు మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







