Dh2.5 మిలియన్ల సిగరెట్ బాక్సుల చోరీ.. తొమ్మిది మందికి జైలు, జరిమానా
- February 20, 2023
దుబాయ్: అల్ ఖుసైస్లోని ఓ గిడ్డంగి నుంచి తొమ్మిది మంది వ్యక్తుల ముఠా 2.25 మిలియన్ దిర్హామ్ల విలువైన 375 సిగరెట్లను దొంగిలించారు. దుబాయ్ క్రిమినల్ కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అందులోని ప్రధాన నిందితులైన ఇద్దరికి దొంగిలించిన మొత్తం విలువను జరిమానాగా విధించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల కథనం ప్రకారం.. పొగాకు వ్యాపార సంస్థ డైరెక్టర్ తన కంపెనీ గోదాములో చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. గోదాం వద్దకు వచ్చేసరికి మెయిన్ డోర్ పగులగొట్టి ఉందని బాధితుడు తెలిపాడు. ఆ తర్వాత గోదాంలో నుంచి 375 సిగరెట్ల పెట్టెలు చోరీకి గురైనట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఐడీ బృందం నేరస్థలాన్ని పరిశీలించి అనుమానితులను విచారించింది. అల్ అవీర్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులకు రిటైల్ అమ్మకం కోసం సిగరెట్లను అందజేస్తుండగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. చోరీకి గురైన వస్తువులు అల్ అవీర్లోని గోదాములో ఉంచినట్లు తొమ్మిది మంది దోషుల్లో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. అధికార దాడిని చేసి బాక్సులతోపాటు మిగిలిన ముఠా సభ్యులను అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!







