రాత్రి పూట ఈ పండ్లు తింటున్నారా.? తస్మాత్ జాగ్రత్త.!
- February 20, 2023పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్. పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంతో పాటూ, సి విటమిన్ తదితర ఇతరత్రా విటమిన్లు అధికంగా వుంటాయ్. అందుకే డాక్టర్లు సైతం రోజూ ఒక పండు తినమని సూచిస్తుంటారు.
అయితే, కొన్ని రకాల పండ్లు కొన్ని వేళల్లో తీసుకోవడం వల్ల శరీరానికి మేలు కంటే హాని ఎక్కువగా జరుగుతుందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు.
అరటి పండును రెగ్యులర్గా తీసుకున్నా ఎలాంటి ప్రమాదమూ లేదు. అలాగే యాపిల్, దానిమ్మ తదితర పండ్లను ఏ టైమ్లో తీసుకున్నా సమస్య లేదు.
కానీ, ద్రాక్ష, పైనాపిల్ (అనాస) పండ్లను రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. ద్రాక్ష, పైనాపిల్ పండ్లకు త్వరగా జీర్ణమయ్యే శక్తి చాలా తక్కువ. అందుకే, వాటిని రాత్రి పూట తీసుకుంటే, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయట. అలాగే, గ్యాస్ ఫామ్ అవ్వడం వంటి అననుకూల పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెబుతున్నారు. అందుకే రాత్రి పూట వీలైనంత వరకూ ఈ పండ్లకు దూరంగా వుంటే మంచిది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!