టర్కీలో ముగిసిన యూఏఈ ‘గాలంట్ నైట్-2’ ఆపరేషన్
- February 20, 2023
యూఏఈ: టర్కీలో "గాలంట్ నైట్ - 2" ఆపరేషన్లో భాగంగా సెర్చ్ అండ్ రెస్క్యూ మిషన్లను పూర్తి చేసినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ ప్రకటించింది. టర్కిష్ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ (AFAD) శోధన, రెస్క్యూ కార్యకలాపాలను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఎమిరాటీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ టర్కీలో వరుసగా 14 రోజులు పనిచేసిన తర్వాత ఈరోజు స్వదేశానికి తిరిగి రానుంది. "గ్యాలంట్ నైట్-2" ఆపరేషన్ యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. టర్కీ ప్రభుత్వం తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్, చాలా క్లిష్ట సమయంలో సత్వర స్పందన, విశేషమైన సహాయానికి ఎమిరాటీ బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు. టర్కీలో కార్యకలాపాలను ముగించినట్లు ప్రకటించిన తర్వాత టర్కీని విడిచిపెట్టిన చివరి అంతర్జాతీయ రెస్క్యూ బృందం యూఏఈ అయింది. ఈ బృందం పది మందిని రక్షించడంతోపాటు 26 మంది మృతదేహాలను భూకంప శిథిలాల నుంచి వెలికితీయడంలో విజయం సాధించింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









