ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భారతీయ మహిళ
- February 21, 2023
కువైట్: ఓ భారతీయ మహిళ ఫిబ్రవరి 19న తన ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కువైట్ లోని ఫహాహీల్లో జరిగింది. మృతురాలిని తమిళనాడుకు చెందిన అఖిలా కార్తీగా గుర్తించారు. ఫహాహీల్లోని తమ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి దూకే ముందు ఆమె తన ఇద్దరు పిల్లలను(10 సంవత్సరాల కుమారుడు, 12 సంవత్సరాల కుమార్తె) ఊపిరాడక చంపేసిందని పోలీసులు తెలిపారు. ఆమె డిప్రెషన్తో బాధపడుతూ చికిత్స పొందుతోందని గుర్తించారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండటం, ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులు డోర్లను బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో పిల్లలిద్దరూ శవమై పడి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న అఖిలా కార్తీ, ఆమె భర్త ఇద్దరూ ఇంజనీర్లు. తమిళ అసోసియేషన్ కువైట్లో అఖిలా కార్తీ క్రియాశీల సభ్యురాలని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







