రమదాన్ 2023: చాలా పాఠశాలలకు రెండు వారాల వరకు సెలవులు
- February 22, 2023
యూఏఈ: అనేక పాఠశాలల విద్యార్థులు పవిత్ర రమదాన్ మాసంలో ఎక్కువ రోజులు తమ కుటుంబాలతో కలిసి గడపవచ్చు. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, ఉపవాస మాసం మార్చి 23న ప్రారంభం కానుంది. ఆ సమయంలో అనేక పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. లేదా అప్పటికే విద్యా సంవత్సరం పూర్తి కానుంది.
అప్టౌన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాబ్ కామన్స్ మాట్లాడుతూ.. వేసవి విరామం అధికారికంగా మార్చి 25న ప్రారంభమవుతుందన్నారు. ఇది ఏప్రిల్ 9న ముగుస్తుందని, కాగా రమదాన్ తేదీలను బట్టి వీటిల్లో మార్పులు ఉంటాయని తెలిపారు. రమదాన్ మొదటి రెండు లేదా మూడు రోజులు పాఠశాలలో, ఆ తర్వాత రెండు వారాల సెలవులు, ఆపై ఈద్ అల్ ఫితర్ వరకు విరామం తర్వాత దాదాపు ఎనిమిది-10 పాఠశాల ఉంటుందని పేర్కొన్నారు. పవిత్ర మాసం 29 రోజులు ఉంటుందని భావిస్తున్నారు. ఈద్ అల్ ఫితర్ మొదటి రోజు శుక్రవారం, ఏప్రిల్ 21న వస్తుంది. యూఏఈ నివాసితులు ఇస్లామిక్ పండుగ కోసం నాలుగు రోజుల వారాంతం ఉంటుంది. ఏప్రిల్ 20 నుండి 23 వరకు ఈ విరామం ఉంటుంది.
అమెరికన్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ లిసా జాన్సన్ మాట్లాడుతూ.. వేసవి విరామం రమదాన్ మొదటి రెండు వారాలతో సమానంగా ఉంటుందని చెప్పారు. ఉపవాసం వేళ ఇద తమ అమ్మాయిలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వేసవి విరామ సమయం పాఠశాల అసైన్మెంట్లు, అదనపు ఒత్తిడి లేకుండా వారి ఆధ్యాత్మిక అభ్యాసాలపై దృష్టి పెట్టడానికి వారికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా.. అనేక భారతీయ-పాఠ్యాంశ పాఠశాలల్లో విద్యా సంవత్సరం మార్చిలో ముగుస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు విరామం రమదాన్ ప్రారంభంతో సమానంగా ఉంటుంది. విద్యా సంవత్సరం చివరి రోజు మార్చి 17 కాగా, కొత్తది (ఒకటి) ఏప్రిల్ 3న ప్రారంభమవుతుంది. దుబాయ్లోని ఒక భారతీయ పాఠశాల తల్లిదండ్రులకు సర్క్యులర్ పంపింది. 2022-23 విద్యా సంవత్సరం చివరి రోజు మార్చి 16 అని వారికి తెలియజేసింది. అంటే భారతీయ పాఠ్యాంశ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు రమదాన్ సందర్భంగా దాదాపు 10 రోజుల సెలవు లభిస్తుంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







