నేపాల్ వైద్యుడికి 5వ ఇసా అవార్డును అందజేసిన బహ్రెయిన్ రాజు
- February 22, 2023
బహ్రెయిన్: వైద్య రంగంలో విశిష్టసేవలు అందించిన నేపాల్ వైద్య నిపుణుడు డాక్టర్ సందుక్ రూట్కు 2021-2022 ఇసా అవార్డును హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రదానం చేశారు. ఇసా కల్చరల్ సెంటర్లో అవార్డుల వేడుకను నిర్వహించారు. డాక్టర్ రూట్ కంటిశుక్లం చికిత్సకు కొత్త పద్ధతిని రూపొందించడంతోపాటు తక్కువ ధరకే లెన్స్ లను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో విజయం సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా అంధత్వ నివారణలో ఇది కీలక ముందడుగా నిపుణులు పేర్కొంటున్నారు.
దివంగత హిస్ మెజెస్టి షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఈ అవార్డును ప్రారంభించారని, మానవాళికి సేవ చేయడంలో అతని గొప్ప పాత్రకు నివాళి అని దివంగత హిజ్ మెజెస్టి షేక్ ఇసా కృషిని గౌరవించడంలో అవార్డు ప్రాముఖ్యతను హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ సందర్భంగా తెలియజేశారు.
విజేత డాక్టర్ సందుక్ రూట్ సాధించిన విజయాలను హైలైట్ చేసే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ రూట్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన బహ్రెయిన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మానవత్వానికి సేవ చేసినందుకు ఈసా అవార్డు ఈ గొప్ప దేశం, దాని ప్రజల నిజమైన విలువను సూచిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ ప్రజల తరపున తాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









