పొడవైన జిప్-లైన్ రైడ్ కు సిద్ధంగా ఉన్నారా?
- February 23, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ ఖాసాబ్లో 1,800 మీటర్ల డ్యూయల్ జిప్లైన్ ప్రాజెక్ట్ కోసం సాఫ్ట్ ఓపెనింగ్ ను ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (OMRAN గ్రూప్) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు సాహసం, అన్వేషణతో కూడిన అనేక అనుభవాలను అందించడానికి రూపొందించబడిన సమీకృత అడ్వెంచర్ సెంటర్లో భాగంగా రూపొందినట్లు పేర్కొంది. జిప్లైన్ ప్రాజెక్ట్ అనేది ఒమన్ అడ్వెంచర్ సెంటర్ అందించే మొదటి కార్యాచరణ ప్రోగ్రామ్ కింద రూపొందించారు. దీంతో ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందని ముసందమ్ గవర్నర్ కార్యాలయ అధిపతి ముబారక్ బిన్ అలీ అల్ రహ్బీ తెలిపారు. ఈ విశిష్ట ప్రాజెక్ట్ ను త్వరంలోనే అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధం చేస్తున్నట్లు OMRAN గ్రూప్లో డెవలప్మెంట్ మేనేజర్ మేసర్ అల్ కమ్జారీ వెల్లడించారు. జిప్లైన్ను అనుభవించడానికి అధికారిక సెలవులతో సహా వారాంతపు రోజులలో ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఒమన్ అడ్వెంచర్ సెంటర్ను సందర్శకులు సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









