పొడవైన జిప్-లైన్ రైడ్ కు సిద్ధంగా ఉన్నారా?
- February 23, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ ఖాసాబ్లో 1,800 మీటర్ల డ్యూయల్ జిప్లైన్ ప్రాజెక్ట్ కోసం సాఫ్ట్ ఓపెనింగ్ ను ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (OMRAN గ్రూప్) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు సాహసం, అన్వేషణతో కూడిన అనేక అనుభవాలను అందించడానికి రూపొందించబడిన సమీకృత అడ్వెంచర్ సెంటర్లో భాగంగా రూపొందినట్లు పేర్కొంది. జిప్లైన్ ప్రాజెక్ట్ అనేది ఒమన్ అడ్వెంచర్ సెంటర్ అందించే మొదటి కార్యాచరణ ప్రోగ్రామ్ కింద రూపొందించారు. దీంతో ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందని ముసందమ్ గవర్నర్ కార్యాలయ అధిపతి ముబారక్ బిన్ అలీ అల్ రహ్బీ తెలిపారు. ఈ విశిష్ట ప్రాజెక్ట్ ను త్వరంలోనే అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధం చేస్తున్నట్లు OMRAN గ్రూప్లో డెవలప్మెంట్ మేనేజర్ మేసర్ అల్ కమ్జారీ వెల్లడించారు. జిప్లైన్ను అనుభవించడానికి అధికారిక సెలవులతో సహా వారాంతపు రోజులలో ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఒమన్ అడ్వెంచర్ సెంటర్ను సందర్శకులు సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







