పొడవైన జిప్-లైన్ రైడ్ కు సిద్ధంగా ఉన్నారా?
- February 23, 2023
మస్కట్: ముసండం గవర్నరేట్లోని విలాయత్ ఆఫ్ ఖాసాబ్లో 1,800 మీటర్ల డ్యూయల్ జిప్లైన్ ప్రాజెక్ట్ కోసం సాఫ్ట్ ఓపెనింగ్ ను ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ (OMRAN గ్రూప్) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ పర్యాటకులకు సాహసం, అన్వేషణతో కూడిన అనేక అనుభవాలను అందించడానికి రూపొందించబడిన సమీకృత అడ్వెంచర్ సెంటర్లో భాగంగా రూపొందినట్లు పేర్కొంది. జిప్లైన్ ప్రాజెక్ట్ అనేది ఒమన్ అడ్వెంచర్ సెంటర్ అందించే మొదటి కార్యాచరణ ప్రోగ్రామ్ కింద రూపొందించారు. దీంతో ఈ ప్రాంతం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారనుందని ముసందమ్ గవర్నర్ కార్యాలయ అధిపతి ముబారక్ బిన్ అలీ అల్ రహ్బీ తెలిపారు. ఈ విశిష్ట ప్రాజెక్ట్ ను త్వరంలోనే అధికారికంగా ప్రారంభించటానికి సిద్ధం చేస్తున్నట్లు OMRAN గ్రూప్లో డెవలప్మెంట్ మేనేజర్ మేసర్ అల్ కమ్జారీ వెల్లడించారు. జిప్లైన్ను అనుభవించడానికి అధికారిక సెలవులతో సహా వారాంతపు రోజులలో ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 గంటల వరకు ఒమన్ అడ్వెంచర్ సెంటర్ను సందర్శకులు సందర్శించవచ్చు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







