యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- February 23, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్, యూఏఈ మధ్య దీర్ఘకాల సంబంధాలు రెండు దేశాలు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక విజయాలను అందించాయని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పేర్కొన్నారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అబుధాబిలోని కసర్ అల్ బహర్ ప్యాలెస్లో యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ల నిరంతర మద్దతుతో ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆసక్తికి సంబంధించిన తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, బహ్రెయిన్-యూఏఈ సంబంధాలు, సహకారాన్ని మరింత పటిష్టం చేసే కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ హెచ్ఆర్హెచ్ ప్రైవేట్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా బిన్ ఇసా అల్ ఖలీఫా,యూఏఈలోని బహ్రెయిన్ రాయబారి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బిన్ అలీ అల్ ఖలీఫా, పలువురు సీనియర్ యూఏఈ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









