యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్
- February 23, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్, యూఏఈ మధ్య దీర్ఘకాల సంబంధాలు రెండు దేశాలు, వారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక విజయాలను అందించాయని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా పేర్కొన్నారు. హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అబుధాబిలోని కసర్ అల్ బహర్ ప్యాలెస్లో యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ల నిరంతర మద్దతుతో ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవడంపై చర్చించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆసక్తికి సంబంధించిన తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు, బహ్రెయిన్-యూఏఈ సంబంధాలు, సహకారాన్ని మరింత పటిష్టం చేసే కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక, జాతీయ ఆర్థిక మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ హెచ్ఆర్హెచ్ ప్రైవేట్ సెక్రటరీ షేక్ అబ్దుల్లా బిన్ ఇసా అల్ ఖలీఫా,యూఏఈలోని బహ్రెయిన్ రాయబారి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా బిన్ అలీ అల్ ఖలీఫా, పలువురు సీనియర్ యూఏఈ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము







