ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్: భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా
- February 23, 2023
ఆస్ట్రేలియా: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ పోరాటం ముగిసింది.సెమీఫైనల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది.భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.. ఫైనల్ కు చేరుకుంది. 173 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఓపెనర్లు షఫాలీ శర్మ(9), స్మృతీ మందాన(2), యస్తికా భాటియా(4) విఫలమైనా జెమీమా రోడ్రిగ్స్ 43(24 బంతుల్లో), హర్మన్ ప్రీత్ 52(34 బంతుల్లో) ఆదుకున్నారు. అయితే చివరలో హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఓ దశలో గెలుస్తుందనుకున్న భారత్ ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది.
కాగా ఈ మ్యాచ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుతంగా ఆడింది. హాఫ్ సెంచరీతో చెలరేగింది. 34 బంతుల్లోనే 52 పరుగులు చేసింది. 6 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి భారత్ ను విజయానికి చేరువ చేసింది. మరికాసేపు ఆమె క్రీజులో ఉండి ఉంటే గెలుపు మనదే అని అంతా అనుకున్నారు. భారత్ విజయానికి 32 బంతుల్లో 39 రన్స్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆమె రనౌట్ అయ్యింది. అంతే, మ్యాచ్ ములుపు తిరిగింది. భారత్ ఓటమి పాలైంది.
కేప్ టౌన్ జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ 54, కెప్టెన్ మెగ్ లానింగ్ 49 (నాటౌట్), ఆష్లే గార్డనర్ 31, అలీసా హీలా 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో శిఖా పాండే 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
173 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన 2, యువ బ్యాటర్ షెఫాలీ వర్మ 9 పరుగులకే వెనుదిరిగారు. వన్ డౌన్ లో వచ్చిన యస్తికా భాటియా 4 పరుగులు చేసి రనౌట్ అయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ జట్టును ఆదుకున్నారు. కానీ, జట్టుని గెలిపించలేకపోయారు.
తాజా వార్తలు
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!







