జూన్‌ 27లోపు ఏపీ రాజధాని ఉద్యోగులను అమరావతికి ..

- May 04, 2016 , by Maagulf
జూన్‌ 27లోపు ఏపీ రాజధాని ఉద్యోగులను అమరావతికి ..

 హైదరాబాద్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను జూన్‌ 27లోపు ఏపీ రాజధాని అమరావతికి తరలిస్తామని ఏపీ పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ ప్రకటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై నిర్మాణ సంస్థ ప్రతినిధులతో చర్చించారు.సకాలంలో పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అందిస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రి నారాయణకు హామీ ఇచ్చారు. సచివాలయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయన్నారు. ఉద్యోగుల విధులకు ఆటంకం లేకుండా నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించారు. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు త్వరలోనే ప్లాట్లు అందిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే నేలపాడుకు ల్యాండ్‌ పూలింగ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com