సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!

- February 27, 2023 , by Maagulf
సివరాఖరికి శివగామికే ఫిక్సయిపోయిన త్రివిక్రముడు.!

మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. జెట్ స్పీడులో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి మహేష్ బాబు ఇంట వరుస విషాదాలతో బ్రేకులు పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేశారు. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల సెకండ్ హీరోయిన్ రోల్ పోషిస్తోంది. అలాగే, త్రివిక్రమ్ సినిమాల్లో సహజంగానే ఓ సీనియర్ లేడీ పాత్రకు అత్యధిక ప్రాధాన్యత వుంటుంది. అలా ఈ సినిమాలోనూ ఓ సీనియర్ లేడీ పవర్ ఫుల్ వుండనే వుంది. 
ఆ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ నటీమణుల పేర్లు వినిపించగా.. చివరికి టాలీవుడ్ డేరింగ్ లేడీ రమ్యకృష్ణ వద్దే త్రివిక్రమ్ బండి ఆగిపోయింది. ఎంతైనా శివగామికి మించిన వాళ్లుంటారా చెప్పండి.! త్వరలో జరగబోయే షెడ్యూల్‌లో రమ్యకృష్ణ పాల్గొనబోతోందనీ సమాచారం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com