‘దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో’ను సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్

- March 03, 2023 , by Maagulf
‘దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో’ను సందర్శించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్

యూఏఈ: మిడిల్ ఈస్ట్ అతిపెద్ద సముద్ర యాత్ర అయిన దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో యొక్క 29వ ఎడిషన్‌ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సందర్శించారు. మార్చి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన మార్చి 5 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా షేక్ మహమ్మద్..  ప్రదర్శించిన అత్యంత ప్రముఖమైన పడవలు, ఓడల గురించి అడిగి తెలుసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2023 ఎడిషన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ సముద్ర బ్రాండ్‌ల నుండి 175 పడవలు, ఓడలను ఇందులో ప్రదర్శించారు. 60 దేశాల నుండి 1,000 కంటే ఎక్కువ ఎగ్జిబిటింగ్ కంపెనీలు, బ్రాండ్‌లను కలిగి ఉంది. ఐదు రోజులలో 30,000 మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com