యూఏఈ వ్యోమగామి సుల్తాన్ సహా అంతరిక్ష కేంద్రానికి చేరిన క్రూ-6 సభ్యులు
- March 03, 2023యూఏఈ: గత 24 గంటల ప్రయాణం అనంతరం యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తన క్రూ-6 సహచరులతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్నారు. రాబోయే ఆరు నెలల పాటు అక్కడే వారు ఉండి పలు పరిశోధనలు చేయనున్నారు. అంతరిక్ష కేంద్రం చేరగానే వ్యోమగాములు తమ ప్రయాణ అనుభవాలను వివరించారు. అయితే, సుల్తాన్ అరబిక్లో మాట్లాడారు. తన కుటుంబానికి, యూఏఈ నాయకత్వం, MBRSC కు ధన్యవాదాలు తెలిపారు. యూఏఈ, అంతర్జాతీయ భాగస్వాముల సహకారంతో చేపట్టనున్న తమ ప్రయోగ ఫలితాలు మానవాళి ప్రయోజనం కోసం సైన్స్ సరిహద్దులను చెరపడంలో సహాయం చేస్తోందన్నారు. అంతకుముందు క్రూ-6 సభ్యులకు ఐఎస్ఎస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత నాసా మిషన్ కమాండర్ స్టీఫెన్ బోవెన్ కేంద్రంలోకి ప్రవేశించగా.. ఆ తర్వాత నాసా పైలట్ వారెన్ హోబర్గ్, యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, రోస్కోస్మోస్, కాస్మోనాట్, ఆండ్రీ ఫెడ్యావ్ వరుసగా ఐఎస్ఎస్ లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్