ఒమన్లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులు అరెస్ట్
- March 06, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 600 మందికి పైగా ప్రవాస కార్మికులను అరెస్టు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఫిబ్రవరి 2023లో కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసుల సంఖ్య 626గా ఉంది. ఇందులో తమ స్పాన్సర్లను వదిలి ఇతరుల కోసం పనిచేస్తున్న 230 మంది ప్రవాసులు ఉన్నారు. 319 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టగా.. వారిలో 77 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. మరోవైపు ఫిబ్రవరి 2023లో బహిష్కరించబడిన ప్రవాసుల సంఖ్య 391 మంది కార్మికులకు చేరుకుంది. ఇందులో 68 మంది తమ స్పాన్సర్లను విడిచిపెట్టి ఇతరుల కోసం పనిచేస్తున్నారు. 214 మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు. వారిలో 109 మంది ఇతర ఉల్లంఘనలకు పాల్పడ్డారని కార్మిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









