వేగంగా వ్యాపిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. ఇద్దరు మృతి
- March 10, 2023
న్యూఢిల్లీ: హెచ్ 3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదవగా, ఎనిమిది హెచ్1ఎన్1 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, వీటిలో అధికంగా హాంకాంగ్ ఫ్లూ (హెచ్3ఎన్2) వైరస్ కారణంగా వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. అధిక శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారని, ప్రస్తుతం దేశంలో హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్లు విస్తృతి కొనసాగుతోందని పేర్కొంది.
దగ్గు, చలి జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాసలో గురక వంటి లక్షణాలతో పాటు వికారం, గొంతు నొప్పి, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన అలసట ఈ వైరస్ లక్షణాలుగా పేర్కొంది. ఈ లక్షణాలు వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని, ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. కరోనా తరహాలో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, శుభ్రత పాటించడం అవసరమని వైద్యులు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారితో పాటు వృద్ధులు, చిన్నపిల్లలకు వైరస్ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







