18 ఏళ్ల తర్వాత స్వదేశానికి డొంగ కనమ్మ
- March 11, 2023
బహ్రెయిన్:డొంగ కనమ్మ (60) ఆంధ్రప్రదేశ్ నుండి 18 సంవత్సరాల క్రితం బహ్రెయిన్కు చేరుకున్నారు.ఆమె వద్ద గత 18 సంవత్సరాలుగా ఎటువంటి ప్రయాణ పత్రాలు కూడా లేవు. భారత రాయబార కార్యాలయం సహాయంతో గత సెప్టెంబరులో భారత ప్రభుత్వ అధికారుల నుండి అందుబాటులో ఉన్న పత్రాలతో EC జారీ చేశారు.అంతకు ముందు ఆమె ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ను క్లియర్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.కానీ దురదృష్టవశాత్తు రుజువు పత్రాలు లేకపోవడం, సిస్టమ్లో వివరాలు లేకపోవడం వల్ల సమస్య పరిష్కారం కాలేదు. రెండు వారాల క్రితం ప్రవాసీ లీగల్ సెల్ కంట్రీ హెడ్ సుధీర్ తిరునిలత్ మళ్లీ ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించారు. ఆమె పరిస్థితిని, వైద్య పరిస్థితులను అధికారులకు వివరించారు. దీంతో సమస్య పరిష్కారం అయి భారత రాయబార కార్యాలయం టిక్కెట్ను అందించింది. డొంగ కానమ్మ ఫ్లై దుబాయ్ విమానంలో హైదరాబాద్కు తిరిగి వెళ్లారు. గత ఏడాది జరిగిన ఇండియన్ ఎంబసీ టీకా డ్రైవ్లో ఆమెను గుర్తించిన ఇండియన్ క్లబ్ వీపీ సానిపాల్ సహాయాన్ని అందించారు.ఆమెకు నివాస సదుపాయంతో పాటు ఆహారం అవసరమైన అన్ని ఇతర మద్దతును అందచేశారు. ఈ సందర్భంగా తనకు సహాయం చేసిన బహ్రెయిన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు, భారత రాయబార కార్యాలయం బహ్రెయిన్ అధికారులు, AP రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సానిపాల్, ది ఇండియన్ క్లబ్ హెల్ప్ డెస్క్ టీమ్, ప్రవాసీ లీగల్ సెల్, వరల్డ్ NRI వారందరికీ డొంగ ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







