ముఘలాయ్ పన్నీర్
- March 11, 2023
కావలసిన పదార్థములు:-
ఉల్లిపాయ - 1, టొమాటోలు -2, పనీర్ క్యూబ్స్ - 400 గ్రా, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి 4 రెబ్బలు,పచ్చి మిరపకాయలు 2 , కొత్తిమీర, కసూరి మేతి 1 స్పూన్, జీడీ పప్పులు 12-15 , మెలోన్ గింజలు 1 టేబుల్ స్పూన్ , పెరుగు చిన్న కప్, ఫుల్ క్రీం 2 టేబుల్ స్పూన్స్ , నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ , ధనియా పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్ , పసుపు 1 స్పూన్, కాశ్మీరీ చిల్లి పొడి 1-2 స్పూన్స్, గరం మసాలా పొడి 1 స్పూన్, మసాలా ఆకు 1
తయారు చేసే పధ్ధతి :
ముందర ఉల్లిపాయ, టొమాటోస్, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ఒక పాన్ లో, 3 చెమ్చాలు నెయ్యి తీసుకుని, నెయ్యి వేడి అయ్యాక, బిర్యాని ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి 3 నిమిషాలు వేయించి, అల్లం, పచ్చిమిర్చి, వెలుల్లిముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ చిదపకుండా అన్ని వైపులా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి మరో 5 నిమిషాల పాటు వేయించండి. మెలోన్ గింజలు, జీడిపప్పులు కొంచెం నీరు వేసి మిక్సీలో మెత్త గా రుబ్బి ఆ పేస్ట్ ని బాణలి లో వేసి ఒక కప్ నీరు వెయ్యండి.గరిట తో కలియ తిప్పాక, పసుపు, కాశ్మీరీ కారం, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి వెయ్యండి. ఒక చిన్న కప్ పెరుగు వేసి గరిటతో కలియ తిప్పండి. స్టవ్ సింలో పెట్టి, 10 నిమిషాల పాటు వేయించాలి, గ్రేవీ చిక్కదనం పోకుండా, పెరుగు విరగకుండా మధ్య లో
గరిట తో కలియతిప్పుతు ఉండాలి. కూర అంచులు నెయ్యి నుంచి విడినప్పుడు తగినంత ఉప్పు వేసి. కూర పైన కసూరి మేతి, కొత్తి మీరా వేసి , 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీం వలయ ఆకారం లో కూర పైన వెయ్యాలి.
ఇలా చేసిన ముఘలాయ్ పన్నీర్ వేడి వేడి గా రొట్టె తో కానీ బిర్యాని తో కానీ తింటే రుచి అమోఘం.
పి. లక్ష్మి కాంత్
న్యూ యార్క్ .
తాజా వార్తలు
- మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..
- యూరోపియన్ నేతల అత్యవసర సమావేశం
- ఏపీలో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ గుప్తా
- కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
- సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు చేపడుతున్నాం: హోం మంత్రి అనిత
- బుర్జుమాన్ మాల్ లో టిక్కెట్ లెస్ పార్కింగ్ సిస్టమ్..!!
- యూఏఈలో ప్రాథమిక ఉత్పత్తుల ధరల పెంపుపై మంత్రి క్లారిటీ..!!
- నాన్-ఆల్కహాలిక్ ఏల్ దుబాయ్లో ప్రారంభం..!!
- డ్రగ్స్ వినియోగం..మహిళకు పదేళ్ల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ జరిమానా..!!
- సీఐడీ అధికారులమని.. గోల్డ్ వ్యాపార సంస్థ నుంచి 300,000 దిర్హామ్లకు పైగా చోరీ..!!