2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వేగా ‘భారతీయ రైల్వే’
- March 14, 2023
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద "గ్రీన్ రైల్వే నెట్వర్క్" కలిగి ఉన్న స్థితిని చేరుకుంటుంది. భారతీయ రైల్వే తన నెట్వర్క్లో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు ఏడేళ్లలో "నెట్-జీరో కార్బన్ ఎమిటర్" అవుతుందని భారత రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు వ్యవస్థ విద్యుదీకరణను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వే ఉత్తరాఖండ్లోని తమ నెట్వర్క్ను విద్యుదీకరించడం అంతర్జాతీయ, దేశీయ పర్యాటకులకు రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ప్రసిద్ధ టైగర్ రిజర్వ్, హిల్ స్టేషన్ ముస్సోరీ వంటి అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించే పర్యాటక ఆకర్షణలు ఈ రాష్ట్ర రైలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి. ఉత్తరాఖండ్ రైలు వ్యవస్థ 1884 నుండి ఉనికిలో ఉంది. ఉత్తర, ఈశాన్య రైల్వే పరిధిలో నిర్మించనున్న అన్ని కొత్త రైలు మార్గాలను పూర్తిగా విద్యుదీకరించనున్నట్లు ఓ ప్రకటనలో భారత రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!