పర్యాటక రంగానికి కేంద్రంగా ఖతార్!
- March 18, 2023
దోహా: ప్రపంచ కప్ తర్వాత కూడా ఖతార్కు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గడం లేదు. దేశ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక ప్రాంతాలను అన్వేషించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దోహాలోని అన్ని ప్రధాన ఐకానిక్ స్థానాల్లో గత వారం ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు కనిపించారు. సౌక్ వాకిఫ్, మ్షీరెబ్, కార్నిచ్, ది పర్ల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్లు కొన్ని అరేబియా వంటకాలు, దేశంలోని వంటకాల ప్రత్యేకతలను ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించడానికి అతిథులను స్వాగతిస్తున్నాయి. వాస్తవానికి పర్యాటక గమ్యస్థానంగా ఉన్న ఖతార్.. సాకర్ ఆటలతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అంతకుముందు వాణిజ్య హబ్ గా ఉన్న ఖతార్.. ఇప్పుడు పర్యాటకంగా కూడా ఉత్తమ గమ్యస్థానంగా మారిందని ఈ రంగంలోని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సౌక్ వాకిఫ్ సాంప్రదాయ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, హస్తకళలు, సావనీర్లు, ప్రపంచ ప్రఖ్యాత రెస్టారెంట్లు, షిషా లాంజ్లకు ఖతార్ నిలయం మారిందని చెబుతున్నారు. గత సీజన్తో పోలిస్తే క్రూయిజ్ షిప్ రాకపోకలు కూడా పెరిగాయని దోహా బస్ జనరల్ మేనేజర్ తారెక్ అమోరా తెలిపారు. ఖతార్లో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికుల ఊపందుకున్నాయని, రాబోయే రోజుల్లో పర్యాటకులకు అనేక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. దోహా బస్ ఖతార్లోని ప్రముఖ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇది పర్యాటకం, ఆతిథ్యం సేవలను అందిస్తుంది. 2013లో స్థాపించబడిన ఈ సంస్థ.. హాప్ ఆన్ హాప్ ఆఫ్ టూర్ ప్రొవైడర్గా ప్రారంభమైన ప్రైవేట్ యాజమాన్యంలోని సంస్థ.. క్రమంగా టూరిజం, హాస్పిటాలిటీ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందింది.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!