యూఏఈ ఆన్ అరైవల్ వీసా: 50 దేశాల పౌరులకు 30 రోజుల వీసా
- March 18, 2023
యూఏఈ: 50 కంటే ఎక్కువ దేశాల పౌరులు యూఏఈలోకి ప్రవేశించిన తర్వాత 30 రోజుల వీసాను అందుకోవచ్చు. దీనిని 10 రోజుల పాటు పొడిగించవచ్చు లేదా 90 రోజుల వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. అయితే, ఇతర దేశాల పౌరులు మాత్రం యూఏఈకి రాకముందే ప్రవేశ అనుమతిని పొందవలసి ఉంటుంది. ఎవరైనా దానిని స్పాన్సర్ చేయవలసి ఉంటుందని యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ (డిజివో) పేర్కొంది. జీసీసీ దేశాల పౌరులకు వీసా లేదా పర్మిట్ అవసరం లేదని లేదా యూఏఈలోని జాతీయ లేదా నివాసి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదని కూడా వివరించింది. వారు యూఏఈలోకి ప్రవేశించే సమయంలో వారి జీసీసీ కంట్రీ పాస్పోర్ట్ లేదా జాతీయ ID కార్డ్ను సమర్పించాలని పేర్కొంది.
"విజిట్ దుబాయ్" వెబ్సైట్ ద్వారా 50 కంటే ఎక్కువ దేశాల పౌరులు 30 రోజులు లేదా 90 రోజుల పాటు వీసా ఆన్ అరైవల్తో దుబాయ్ని సందర్శించవచ్చని సూచించారు. ఎవరైనా https://www.visitdubai.com ద్వారా యూఏఈ వీసా కోసం అతని/ఆమె అర్హతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. సాధారణ పాస్పోర్ట్, యూఎస్ఏ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికా జారీ చేసిన గ్రీన్ కార్డ్ లేదా యూకే జారీ చేసిన నివాస వీసా లేదా ఈయూ జారీ చేసిన నివాస వీసా కలిగి ఉన్న భారతీయ పౌరులు వీసాను పొందవచ్చని వివరించింది. వీసాలు లేదా గ్రీన్ కార్డ్ యూఏఈకి చేరిన తేదీ నుండి కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుందని.. అదనంగా 14 రోజులు పొడిగించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!









