రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్నిప్రమాదం
- March 19, 2023యూఏఈ: దుబాయ్లోని రస్ అల్ ఖోర్ పారిశ్రామిక ప్రాంతంలో శనివారం చెలరేగిన మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు ఆర్పివేశారు. అగ్ని ప్రమాదంలో రెండు గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్లు ఓ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు పేర్కొన్నారు. అగ్నిప్రమాదం గురించి సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్కు సాయంత్రం 5.38 గంటలకు సమాచారం అందిందని, వెంటనే నాద్ అల్ షెబా అగ్నిమాపక కేంద్రం నుండి ఒక బృందం ఐదు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మంటలు రెండు గోదాములకు వ్యాపించాయని, సైట్ నుండి భారీగా పొగలు వచ్చాయని తెలిపారు.
తాజా వార్తలు
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం