ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలకు శుభవార్త చెప్పిన ఒమన్
- March 20, 2023
మస్కట్: ఆన్లైన్లో ఇతర ఉత్పత్తులను ప్రమోట్ చేయాలనుకునే లేదా మార్కెటింగ్ చేయాలనుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీలు తప్పనిసరి లైసెన్స్ను పొందేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మార్చి 24 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆన్లైన్ నిబంధనలను ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని వాణిజ్య వ్యవహారాలు మరియు ఇ-కామర్స్ విభాగం డైరెక్టర్ అజ్జా బింట్ ఇబ్రహీం అల్ కిండి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ సొంత ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించాలనుకునే కంపెనీలకు లైసెన్స్ అవసరం లేదని తెలిపారు. మార్చి 24 నుండి వాణిజ్యం, పరిశ్రమలు, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ వెబ్సైట్లు, సోషల్ మీడియాలో మార్కెటింగ్, ప్రమోషన్ యాక్టివిటీని నియంత్రించే నియంత్రణను అమలు చేయడాన్ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు. లైసెన్స్ హోల్డర్లపై ఎటువంటి పన్నులు వర్తించవని, వారి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి బహుళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకోవడానికి ఒక లైసెన్స్ని ఉపయోగించవచ్చని తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏదైనా ప్రవాస కంపెనీ లేదా వ్యక్తులు ఒమన్కు వచ్చి తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేసుకోవచ్చు. అయితే సుల్తానేట్ ఆఫ్ ఒమన్లో అతని లేదా ఆమె కార్యకలాపాలను ప్రారంభించడానికి వారి స్వంత కంపెనీని స్థాపించి లైసెన్స్ పొందవలసి ఉంటుందని ఇబ్రహీం అల్ కిండి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







