సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్
- March 24, 2023
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.గుంటూరు మీదుగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులుపెట్టబోతుంది. ఈ రూట్ లో వందేభారత్ నడిస్తే.. సికింద్రాబాద్ -గుంటూరు మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గే అవకాశం ఉంది. అటు గుంటూరు నుంచి తిరుపతికి కూడా ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు.
సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ రైలును బీబీ నగర్- నడికుడి మార్గంలో మిర్యాలగూడ మీదుగా నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముందుగా ఈ రైలును వరంగల్, ఖాజీపేట మార్గంలో నడపాలని రైల్వే అధికారులు భావించినప్పటికీ.. ఆ రూట్ లో దూరం ఎక్కువ అవుతుండడంతో బీబీ నగర్ నడికుడి మార్గంలో నడపాలని నిర్ణయించారు. బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఉన్న రూట్ లో రైల్వే ట్రాక్ ను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







