కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయాలు..
- March 25, 2023
న్యూ ఢిల్లీ: భారత కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది.నిన్న (శుక్రవారం) జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చే డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. 69.76 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంతో కేంద్ర ఖాజానాపై సంవత్సరానికి రూ.12,815 కోట్ల భారం పడనుంది.
2023 జనవరి 1 నుంచే పెరిగిన డీఏ అమలు కానుంది.పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తోంది.వినియోగ ధరల పట్టీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా.. డీఏను పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఏమేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద అందించే LPG సిలిండర్పై ఇచ్చే సబ్సిడీని రూ.200కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేరుకుతుందని కేంద్రం వెల్లడించింది. లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్ను.. సంవత్సరానికి 12 సార్లు.. సబ్సిడితో రీఫిల్ చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు







