కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కీలక నిర్ణయాలు..
- March 25, 2023న్యూ ఢిల్లీ: భారత కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచింది. ఉద్యోగులందరికీ 4 శాతం కరువు భత్యం పెంచుతున్నట్లు ప్రకటించింది.నిన్న (శుక్రవారం) జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు ఇచ్చే డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో 47.58 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. 69.76 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం నిర్ణయంతో కేంద్ర ఖాజానాపై సంవత్సరానికి రూ.12,815 కోట్ల భారం పడనుంది.
2023 జనవరి 1 నుంచే పెరిగిన డీఏ అమలు కానుంది.పెరుగుతున్న ధరల నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగులకు ఊరటగా కేంద్రం డీఏను ఇస్తోంది.వినియోగ ధరల పట్టీ ఆధారంగా కేంద్రం డీఏను లెక్కిస్తుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా.. డీఏను పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఏమేర డీఏ పెంచే అవకాశం ఉంది. ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద అందించే LPG సిలిండర్పై ఇచ్చే సబ్సిడీని రూ.200కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఎక్కవగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 9.6 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేరుకుతుందని కేంద్రం వెల్లడించింది. లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్ను.. సంవత్సరానికి 12 సార్లు.. సబ్సిడితో రీఫిల్ చేసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు