చిరునామా లేని 16,848 కంపెనీ ఫైల్స్ సస్పెండ్..
- March 26, 2023కువైట్: చెల్లుబాటు అయ్యే పౌర చిరునామాలు లేని 16,848 కంపెనీల ఫైళ్లను కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ (PAM) సస్పెండ్ చేసింది. ఆర్టికల్ 18 కింద ఈ కంపెనీల క్రింద 61,688 మంది కార్మికులు నమోదు చేసుకున్నారని తెలిపింది.కాగా కార్మికులు వారి చట్టపరమైన స్థితిని పునరుద్దరించటానికి ఒక నెల గ్రేస్ పీరియడ్ను ఇచ్చినట్లు అథారిటీ పేర్కొంది. "ప్రైవేట్ రంగంలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించేవారిపై నియంత్రణను కఠినతరం చేయాలని" మొదటి ఉప ప్రధానమంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి, రక్షణ మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు PAM తెలిసింది. అయితే, నిర్దిష్ట వ్యవధిలోగా చట్టపరమైన స్థితిని సరిదిద్దడంలో కంపెనీలు విఫలమైతే, యజమానులపై సంబంధిత దర్యాప్తునకు రిఫర్ చెయ్యనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు