యూఏఈ ప్రెసిడెంట్ కోసం ఇఫ్తార్ విందునిచ్చిన షేక్ మొహమ్మద్
- March 27, 2023
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్... యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దుబాయ్లోని జబీల్ ప్యాలెస్లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ ఉప పాలకుడు, యూఏఈ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హిస్ హైనెస్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో అల్ ధాఫ్రా ప్రాంతంలో పాలకుల ప్రతినిధి షేక్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి-అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి -అధ్యక్ష న్యాయశాఖ మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, , విదేశీ వ్యవహారాలు - అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!







