యూఏఈ ప్రెసిడెంట్ కోసం ఇఫ్తార్ విందునిచ్చిన షేక్ మొహమ్మద్
- March 27, 2023యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్... యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దుబాయ్లోని జబీల్ ప్యాలెస్లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కోసం షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ ఉప పాలకుడు, యూఏఈ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హిస్ హైనెస్ షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో అల్ ధాఫ్రా ప్రాంతంలో పాలకుల ప్రతినిధి షేక్ హమ్దాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొన్నారు. వీరితోపాటు అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ షేక్ హజ్జా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి-అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఉప ప్రధాన మంత్రి -అధ్యక్ష న్యాయశాఖ మంత్రి షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, , విదేశీ వ్యవహారాలు - అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ లతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్