డయాబెటిస్ రోగులకి ఈ ఆకులు ఓ ఔషధం.!
- March 27, 2023 
            సీతాఫలం ఎంతో బలం అంటారు. అవును నిజమే బలమే కాదు, ఎంతో రుచికరం కూడా ఈ ఫలం. అయితే, ఈ పండులో అధిక మోతాదులో చక్కెర స్థాయిలు వుండడం వల్ల డయాబెటిస్ వున్న వాళ్లు ఈ పండుకు దూరంగా వుండమని సూచిస్తుంటారు.
అయితే, సీతా ఫలం.. పండు సంగతెలా వున్నా వీటి ఆకులు మాత్రం డయాబెటిక్ రోగులకు ఓ వరమే అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
ఆయుర్వేదపరంగానే కాదు, వైద్య ప్రామాణికంగానూ ఈ ఆకులకు డయాబెటిస్ తగ్గించే శక్తి వుందని కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.
రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచడం ద్వారా డయాబెటిస్ని అదుపులో వుంచొచ్చు. సీతాఫలం ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నట్లు తాజా అధ్యయనాల్లో బయటపడింది. ఈ ఆకులను తినడం వల్ల ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో వుంటాయట.
సో, డయాబెటిక్ రోగులకు ఈ ఆకులు చాలా ఉపయోగకరమైనవిగా చెబుతున్నారు. రోజూ రెండు ఆకులను నమిలి తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుందంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







