షార్జాలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు..
- March 27, 2023
యూఏఈ: షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మార్చి 2న ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాలను సగానికి (50 శాతం) తగ్గించడంతో పాటు మార్చి 31, 2023లోపు ఉల్లంఘనలకు సంబంధించిన ఇంప్యూండ్మెంట్ ఆర్డర్లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని షార్జా పోలీస్లోని ట్రాఫిక్ -పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ ముహమ్మద్ అలై తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని.. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







