షార్జాలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు..
- March 27, 2023యూఏఈ: షార్జాలో ట్రాఫిక్ జరిమానాలపై వాహనదారులకు 50 శాతం తగ్గింపును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని మార్చి 2న ప్రకటించారు. ట్రాఫిక్ జరిమానాలను సగానికి (50 శాతం) తగ్గించడంతో పాటు మార్చి 31, 2023లోపు ఉల్లంఘనలకు సంబంధించిన ఇంప్యూండ్మెంట్ ఆర్డర్లు, బ్లాక్ పాయింట్లు రద్దు చేయబడతాయని షార్జా పోలీస్లోని ట్రాఫిక్ -పెట్రోల్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ ముహమ్మద్ అలై తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని.. ఉల్లంఘనకు పాల్పడిన తేదీ నుండి 60 రోజులలోపు జరిమానా చెల్లించినట్లయితే వాహనదారులు 35 శాతం తగ్గింపును పొందుతారు. ఉల్లంఘించిన 60 రోజుల నుంచి ఏడాదిలోపు జరిమానా చెల్లిస్తే వాహనదారులకు 25 శాతం రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ