ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!
- March 28, 2023
యూఏఈ: స్టార్గేజర్లుగా అభివర్ణించే ఐదు గ్రహాల అమరిక.. మార్చి 28న రాత్రి యూఏఈ ఆకాశంలో కనువించు చేయనుంది. బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, మార్స్ సూర్యాస్తమయం ఓకే వరుసలో ఆకాశంలో చంద్రుడితో పాటు ఆర్క్ రూపంలో కనిపిస్తుంది. కానీ, పరిసర కాంతి పరిస్థితిపై ఆధారపడి ఈ గ్రహాల అమరికను ప్రభావవంతంగా చూడగలరని నిపుణులు చెప్పారు. అయితే, యూఏఈలో ఈ గ్రహాల అమరిక దృశ్యాన్ని ప్రజలు ఆస్వాదించవచ్చని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇది జరుగుతుందని, గత సంవత్సరం ఇలాంటి అరుదైన గ్రహాల అమరిక ఉదయం జరిగిందని గుర్తుచేశారు. సాధారణంగా గ్రహాలు వేర్వేరు కక్ష్యలు.. కక్ష్య కాలాల్లో సూర్యుని చుట్టూ తిరుగుతాయని, కొన్నిసార్లు అవి ఒక అమరికలో ఆకాశంలో కనిపిస్తాయని పేర్కొన్నారు. అయితే, బైనాక్యులర్లను ఉపయోగించడం వల్ల గ్రహాలను స్పష్టంగా చూడవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







