భారత రొయ్యల దిగుమతిపై సౌదీ తాత్కాలిక నిషేధం
- March 30, 2023
రియాద్ : భారతదేశం నుండి రొయ్యల దిగుమతులపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV) ఉనికిని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. సరిహద్దుత ద్వారా దిగుమతి చేసుకున్న రొయ్యలతో సహా సముద్ర ఉత్పత్తుల నమూనాలను సేకరించాలని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నమూనాల పరీక్షలో భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో WSSV ఉన్నట్లు గుర్తించినట్ల వెల్లడించింది. అయితే, వైట్ స్పాట్ సిండ్రోమ్ అనేది పెనైడ్ రొయ్యల వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ఇది అంటువ్యాధి.. రొయ్యలను త్వరగా చనిపోయేలా చేస్తుంది. కాగా, ఇది మానవ ఆరోగ్యానికి లేదా ఆహార భద్రతకు ముప్పు కలిగించదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









