భారత రొయ్యల దిగుమతిపై సౌదీ తాత్కాలిక నిషేధం
- March 30, 2023
రియాద్ : భారతదేశం నుండి రొయ్యల దిగుమతులపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV) ఉనికిని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. సరిహద్దుత ద్వారా దిగుమతి చేసుకున్న రొయ్యలతో సహా సముద్ర ఉత్పత్తుల నమూనాలను సేకరించాలని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నమూనాల పరీక్షలో భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో WSSV ఉన్నట్లు గుర్తించినట్ల వెల్లడించింది. అయితే, వైట్ స్పాట్ సిండ్రోమ్ అనేది పెనైడ్ రొయ్యల వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ఇది అంటువ్యాధి.. రొయ్యలను త్వరగా చనిపోయేలా చేస్తుంది. కాగా, ఇది మానవ ఆరోగ్యానికి లేదా ఆహార భద్రతకు ముప్పు కలిగించదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







