భారత రొయ్యల దిగుమతిపై సౌదీ తాత్కాలిక నిషేధం
- March 30, 2023
రియాద్ : భారతదేశం నుండి రొయ్యల దిగుమతులపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) తాత్కాలిక నిషేధం విధించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ (WSSV) ఉనికిని గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది. సరిహద్దుత ద్వారా దిగుమతి చేసుకున్న రొయ్యలతో సహా సముద్ర ఉత్పత్తుల నమూనాలను సేకరించాలని పర్యావరణ, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. నమూనాల పరీక్షలో భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న రొయ్యల ఉత్పత్తులలో WSSV ఉన్నట్లు గుర్తించినట్ల వెల్లడించింది. అయితే, వైట్ స్పాట్ సిండ్రోమ్ అనేది పెనైడ్ రొయ్యల వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి చాలా ప్రాణాంతకం. ఇది అంటువ్యాధి.. రొయ్యలను త్వరగా చనిపోయేలా చేస్తుంది. కాగా, ఇది మానవ ఆరోగ్యానికి లేదా ఆహార భద్రతకు ముప్పు కలిగించదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







